Saturday, September 21, 2013

రక్షిత సుమ-అడుగులు పై విశ్లేషణ


Narayana Sharma Mallavajjala గారి ఈనాటి కవిత-45 గా నా కవిత ‘‘ అడుగులు’’ పై kavi sangamam*కవి సంగమం*(Poetry ) గ్రూపులో చేసిన విశ్లేషణ



ఒక వస్తువునుంచి ప్రకృతిని వెదుక్కోవటం.ప్రకృతినించి వస్తువును చేరటం తొలినాళ్లలో రాసేవారికి ఒక కవిత్వీకరణ సూత్రం.ప్రాసను (ప్రాస కవిత్వ భాగమే ..కాని కేవలం ప్రాస గాదు)కవిత్వ మనుకోవటం అక్కడినుండే మొదలైంది. చాల కాలం క్రితం ఒక పదాన్నో ,వాక్యాన్నో ఊనికగా తీసుకుని కవిత్వం రాసే వారు.నిర్వహణకోసం ఇదొక ప్రాతిపదిక మార్గం.


నిజానికి కవితలో పద సమ్మేళనం ఒక భాగం.చలం గారికి ఈ అలవాటు ఎక్కువ.చాలామంది కవులు ఒక అచ్చుమీదో,పదం మీదో వొత్తిడి(Stress)తో కవిత్వం రాస్తారు
.కవిత్వంలో వేగం (Swift)తేవడానికి ఇదో మార్గం.

రక్షిత సుమ అడుగు అనే పదాన్ని ఊనిక చేసుకుని కవిత అందించారు.నిజానికి ఇది ఊనిక మాత్రమే.మంచి కవితాత్మకమైన వాక్యాలున్నాయి.పైన చెప్పుకున్న సూత్రం కూడా మంచి దర్శనాన్ని ప్రదర్శిస్తుంది.

"పోగుబడ్డ ప్రపంచ విషయాలను పరిశీలనకు పుస్తకాన్నడుగు
వెనక్కితిరిగి ఓ క్షణం పసితనాన్ని చూసి
వసివాడని సంతోషాల కొసరడుగు
మసిబారని ఆలోచనల మెరుపడుగు"

'పోగుబడ్డ ప్రపంచ విషయాలు""వసివాడని సంతోషాలు""మసిబారని ఆలోచనలు"మంచి ప్రయోగాలు.ప్రేరణాత్మకంగా సాగే వచనం పఠనాసక్తినికలిగిస్తుంది.

"వెలుగెక్కడుందని నీడనడుగు
గమ్యాన్ని చేరేలా నడవాలంటే,
ముళ్ళకంపల ముద్దుల్ని మందుపాత్రల హద్దుల్నీ
దాటేయాలి నీ ప్రతి అడుగు"

నిజానికి ఇందులో పై చివరివాక్యంలోని "అడుగే" కవితకు ఊనిక.ప్రశ్నించి తెలుసుకోడంలోనే అన్నీ సమకూరుతాయనే అంసాన్ని ప్రతిపాదిస్తూ ఈవాక్యాలు కొనసాగాయి.కొన్ని వాక్యాలు మంచి భారతని కూఒడా కలిగి కనిపిస్తాయి.

"పరుగెత్తడమే కాదు పడకుండని తూకం కావాలి.
ప్రవహించడమే కాదు పదునెక్కే ప్రగతి వుండాలి. "

పడకుండనితూకం,పదునెక్కె ప్రగతి ఆ భారతని కలిగిస్తాయి.మంచి కవిత రాసినందుకు అభినందనలు.కవిత్వానికి తనదైన ముద్ర రక్షిత సంపాదించుకోవాలి.తనదైన వాతావరణం కవితకి కావాలి.మరింత అధ్యయనం తోడైతే అది ఎంతో దూరంలోలేదు.నిజానికి అలాంటివాతావరణానికోసమే ఇవాళ కవిత్వం చూస్తున్నది. బహుశః కవిసంగమంకూడా ఇలాంటి తరంకోసం చూస్తుంది.మరిన్ని కవితలు "వడి"గా రక్షితనించి కోరుకుంటున్నాను.

No comments:

Post a Comment