Saturday, September 21, 2013

రక్షిత సుమ-అడుగులు పై విశ్లేషణ


Narayana Sharma Mallavajjala గారి ఈనాటి కవిత-45 గా నా కవిత ‘‘ అడుగులు’’ పై kavi sangamam*కవి సంగమం*(Poetry ) గ్రూపులో చేసిన విశ్లేషణ



ఒక వస్తువునుంచి ప్రకృతిని వెదుక్కోవటం.ప్రకృతినించి వస్తువును చేరటం తొలినాళ్లలో రాసేవారికి ఒక కవిత్వీకరణ సూత్రం.ప్రాసను (ప్రాస కవిత్వ భాగమే ..కాని కేవలం ప్రాస గాదు)కవిత్వ మనుకోవటం అక్కడినుండే మొదలైంది. చాల కాలం క్రితం ఒక పదాన్నో ,వాక్యాన్నో ఊనికగా తీసుకుని కవిత్వం రాసే వారు.నిర్వహణకోసం ఇదొక ప్రాతిపదిక మార్గం.

అవిజ్ఞులు

ఎవర్రా బాబు అది 
నగరపు నల్లబల్ల నుదుటిపై
విఘ్నధిపతి అర్ధాన్ని
తిరగేసి రాసింది?
మీ రెండు సిమ్ముల సోల్లో
భక్తి బాలెన్సుంటే
కాసేపలా ఊగులాట్టం ఆపి
ఆయనతొనే సరాసరి
ఓ కాన్ఫరెన్స్ కలపండి
ఇదంతా
ఇలాగే అవసరమా?
అని అడిగేస్తానోసారి.
తేది. 18-09-2013
(నగర వాచకం... నిమజ్జనపు వేళ)